||సుందరకాండ ||

||ఇరువది ఏడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 25 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

శ్లో|| ఇత్యుక్తాః సీతయా ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః|
కాశ్చిత్ జగ్ముః తదాఖ్యాతుం రావణస్య తరస్వినః||1||

స|| ఘోరా రాక్షస్యః క్రోధమూర్ఛితాః ఇత్యుక్తాః సీతాయాః తత్ ఆఖ్యాతుం కాశ్చిత్ తరస్వినః రావణస్య జగ్ముః||

తా|| ఈ విధముగా సీతచే చెప్పబడిన మాటలు వినిన ఘోరమైన రాక్షసులు కొందరు ఆ విషయము చెప్పుటకు రావణుని వద్దకు పరుగిడిరి.

శ్లో|| తతస్సీతా ముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః|
పునః పరుషమేకార్థం అనర్థార్థమ్ అథాబ్రువన్||2||
అద్యేదానీం తవానార్యే సీతే పాపవినిశ్చయే|
రాక్షస్యో భక్షయిష్యంతి మాంస మేతత్ యథాసుఖమ్||3||

స|| తతః సీతాం ఉపాగమ్య రాక్షస్యః ఘోరదర్శనాః పునః పరుషం అనర్ధార్థం ఏకార్థం అథ అబ్రువన్|| అనార్యే పాపనిశ్చయే సీతే అద్య ఇదానీం తవ ఏతత్ మాంసం రాక్షస్యః యథాసుఖం భక్షయిష్యంతి ||

తా|| అప్పుడు సీతను చేరి ఘోరరూపముకల రాక్షసులు ఒకే అర్థముగల అనర్థమైన మాటలు మరల చెప్పసాగిరి." ఓ అనార్యా! పాపములో నిశ్చయముగా వున్న నీ మాంసము ఈ దినమే రాక్షసులందరూ సుఖముగా తినెదరు."

శ్లో|| సీతాం తాభి రనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా|
రాక్షసీ త్రిజటా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్ ||4||
ఆత్మానం ఖాదతా నార్యా న సీతాం భక్షయిష్యథ|
జనకస్య సుతా మిష్టాం స్నుషాం దశరథస్య చ||5||
స్వప్నో హృద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః|
రాక్షసానాం అభావాయ భర్తురస్యా జయాయ చ||6||

స|| తదా అనార్యాభిః తాభిః సంతర్జితాం సీతాం దృష్ట్వా వృద్ధా త్రిజటా రాక్షసీ వాక్యం అబ్రవీత్|| ఆత్మానం ఖాదతా |జనకస్య సుతాం దశరథస్య ఇష్టాం స్నుషాం సీతాం న భక్షయిష్యథ|| అద్య మయా స్వప్నః దృష్టః | దారుణః రోమహర్షణః | రాక్షసానాం అభావాయ అస్యాః భర్తృః జయాయ చ||

తా|| దుష్టులైన వారిచేత భయపెట్టబడుచున్న సీతను చూచి వృద్ధురాలైన రాక్షసి త్రిజట అప్పుడు ఈ వాక్యములను పలికెను. "జనకుని కూతురు దశరథుని కోడలు అయిన సీతను తినకుడు. మిమ్మలిని మీరే తినుడు. ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని. అది దారుణము రోమహర్షణము అయినది. అది అమె భర్త జయమును రాక్షసుల వినాశనమును సూచించుచున్నది.

శ్లో|| ఏవముక్తా త్రిజటాయా రాక్షస్యః క్రోధమూర్ఛితాః|
సర్వా ఏవాబ్రువన్ భీతాః త్రిజటాం తాం ఇదం వచః||7||
కథయస్వ త్వయా దృష్టః స్వప్నోఽయం కీదృశో నిశి|
తాసాం శ్రుత్వాతు వచనం రాక్షసీనాం ముఖాచ్చ్యుతమ్||8||
ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంస్థితమ్|

స|| ఏవం ఉక్తా త్రిజటయా సర్వా రాక్షస్యః క్రోధమూర్ఛితాః భీతాః తాం త్రిజటాం ఇదం వచః అబ్రువన్ ||నిశి త్వయా దృష్టః అయం స్వప్నః కీ దృశః కథయస్వ | రాక్షసీనాం ముఖాచ్యుతం తాసాం వచనం శ్రుత్వా తు త్రిజటా కాలే స్వప్న సంస్థితం వచనం ఉవాచ||

తా|| త్రిజట చెప్పిన ఆ మాటలు వినిన రాక్షస్త్రీలందరూ భయముతో క్రోధమూర్చితులై ఈ మాటలను చెప్పిరి. "రాత్రి నీవు చూసిన స్వప్నము ఏలాంటిదో చెప్పుము"అని. రాక్షసస్త్రీల ముఖమునుంచి వచ్చిన ఆ మాటలు వినిన త్రిజట, వారికి తనకి వచ్చిన స్వప్నము గురించి చెప్పసాగెను.

శ్లో|| గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్||9||
యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః|
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః||10||
స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతా|
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వత మాస్థితా||11||

స||రాఘవః శుక్లమాల్యాంబరధరః లక్ష్మణేన సహ గజదంతమయీం అంతరిక్షగాం హంససహస్రేణ యుక్తాం శిబికాం స్వయం ఆస్థాయ ఆగతః ||అద్య స్వప్నే శుక్లాంబరావృతా సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతం ఆస్థితా సీతా చ మయా దృష్టా||

తా|| " రాఘవుడు తెల్లని వస్త్రములు ధరించినవాడై లక్ష్మణుని తో సహా అంతరిక్షములో గజదంతములతో కూడిన వేయిహంసలు మోస్తున్న పల్లకీమీద వచ్చెను. అప్పుడు స్వప్నములో తెల్లని బట్టలతో సాగరమధ్యములో నున్న పర్వతముపై కూర్చుని ఉన్న సీతాదేవిని చూచితిని.

శ్లో|| రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా|
రాఘవశ్చ మయా దృష్ట శ్చతుర్దంతం మహాగజమ్||12||
ఆరూఢః శైలసంకాశం చచార సహ లక్ష్మణః|
తతస్తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా||13|
శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ|

స|| సీతా రామేణ భాస్కరేణ ప్రభా యథా సంగతా | రామశ్చ చతుర్దష్టం శైలసంకాశమ్ మహాగజం సహ లక్ష్మణః ఆరూఢః మయా దృష్టా|| తతః తౌ శుక్లమాల్యాంబరధరౌ స్వతేజసా దీప్యమానౌ నరశార్దూలౌ జానకీం పర్యుపస్థితౌ||

తా|| "కాంతి భాస్కరునుతో కూడినట్లు సీత రామునితో చెరినది. నాలుగు దంతములుకల పర్వతములతో సమానమైన మహాగజముల పై లక్ష్మణునితో కూడా వున్న రాముని కూడా చూచితిని. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన నరశార్దూలురు వారిద్దరూ తమ తేజస్సుతో వెలుగుతూ సీతవద్దకు వచ్చిరి".

శ్లో|| తతస్తస్య స్యాగ్రే హ్యాకాశ స్థస్య దంతినః||14||
భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా|
భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచనా||15||
చంద్రసూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ|
తతస్తాభ్యాం కుమారాభ్యా మాస్థితః స గజోత్తమః||16||
సీతయా చ విశాలాక్ష్యా లంకాయా ఉపరిస్థితః|

స|| తతః జానకీ తస్య నగస్య అగ్రే భర్త్రా పరిగృహీతస్య ఆకాశస్థస్య దంతినః స్కంధమ్ ఆశ్రితా||తతః కమలలోచనా భర్తుః అంకాత్ సముత్పత్య పాణినా చంద్రసూరౌ పరిమార్జతీ మయా దృష్టా||తతః తాభ్యాం కుమారాభ్యాం విశాలాక్షాయాః సీతాయ చ ఆస్థితః సః గజోత్తమః లంకాయా ఉపరి స్థితః||

తా|| " అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్తచేర చేరెను. అప్పుడు కమలలోచనుడగు ఆ భర్త అంగములనుంచి లేచి సీత చంద్ర సూర్యులను స్పృశించినట్లు చూసితిని. అప్పుడు విశాలాక్షి అయిన సీత, ఆలాగే రాజకుమారులు ఇద్దరూ కూర్చుని ఉన్న ఆ గజము లంకా నగరముపైన నిలబడెను".

శ్లో|| పాణ్డురర్షభ యుక్తేన రథే నాష్టయుజా స్వయమ్|| 17||
ఇహోపయాతః కాకు‍త్ స్థః సీతయా సహ భార్యయా|
లక్ష్మణేన సహభ్రాత్రా సీతయా సహ వీర్యవాన్ ||18||
ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభమ్|
ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః||19||

స|| కాకుత్‍స్థః భార్యయా సీతాయా సహ అష్టాయుజా పాణ్డురర్షభ యుక్తేన రథేన స్వయం ఇహ ఉపయాతః || వీర్యవాన్ సీతాయా సహ భ్రాత్రా లక్ష్మణేన సహ దివ్యం సూర్యసన్నిభం పుష్పకం విమానం ఆరుహ్య ఉత్తరాం దిశాం ఆలోక్యపురుషొత్తమః జగామ||

తా|| "ఆ కాకుత్‍స్థుడు భార్య సీతతో సహా ఎనిమిది వృషభములు కల రథముపై స్వయముగా ఇక్కడికి వచ్చెను. ఆ వీరుడు సీతా లక్ష్మణులతో కలిసి దివ్యమైన సూర్యునితో సమానమైనకాంతిగల దివ్యమైన పుష్పక విమానమెక్కి ఉత్తరదిశలో సాగిపోయెను".

శ్లో|| ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః|
లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయ సహ భార్యయా||20||
న హి రామో మహాతేజా శ్శక్యో జేతుం సురాసురైః|
రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గం పాపజనైరివ||21||

స|| ఏవం రామః విష్ణుపరాక్రమః భార్యయా సీతాయా సహ లక్ష్మణేన భ్రాత్రా సహ స్వప్నే మయా దృష్టః|| రామః మహాతేజః రాక్షసైః వా అన్యైః వా సురాసురైః వా జేతుం న శక్యః| స్వర్గం పాప జనైః ఇవ||

తా|| "ఈ విధముగా విష్ణు పరాక్రమము గల రాముడు, భార్య అయిన సీతతో అలాగే తమ్ముడు లక్ష్మణునితో కలిసి ఉండడము స్వప్నములో నేను చూచితిని. పాపులకు స్వర్గము పొందుట ఎలా శక్యము కాదో అలా రాక్షసుల చేత గాని, ఇతర సురాసురుల చేత గాని, మహాతేజోవంతుడు అగు రాముడు జయింపబడుట శక్యముకాని పని".

శ్లో|| రావణశ్చ మయాదృష్టః క్షితౌ తైలసముత్‍క్షితః |
రక్తవాసాః పిబన్మత్తః కరవీరకృత స్రజః||22||
విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి|
కృష్యమాణ స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః||23||

స|| రక్తవాసాః పిబన్ మత్తః కరవీర కృత స్రజః తైలసముత్‍క్షితః క్షితౌ రావణః చ మయా దృష్టః|| అద్య రావణః కృష్ణాంబరః స్త్రియా కృష్యమాణః ముండః పుష్పకాత్ విమానాత్ భువి పతితః పునః దృష్టః |

తా|| " రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో కరవీర పుష్పముల మాల ధరించి, తైలము తో పూయబడి భూమి మీద పడియున్న రావణుని కూడా చూచితిని. శిరో ముండనము చేయబడిన నల్లని వస్త్రములు ధరించియున్న రావణుని ఒక స్త్రీ ఈడ్చుకు పోతూవున్నట్లు , మళ్ళీ రావణుడు విమానము నుంచి భూమిపై పడుతున్నట్లు చూచితిని".

శ్లో|| రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః|
పిబం స్తైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తకులేంద్రియః||24||
గర్ధభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః|
పునరేవ మయాదృష్టో రావణో రాక్షసేశ్వరః||25||
పతితోఽవాక్ఛిరా భూమౌ గర్ధభాత్ భయమోహితః|

స||రక్తమాల్యానులేపనః తైలం పిబన్ హసన్ నృత్యన్ భ్రాంతచిత్తకులేంద్రియః ఖరయుక్తేన రథేన దక్షిణాం దిశాం ఆస్థితః గర్దభేన శీఘ్రం యయౌ || రాక్షసేశ్వరః రావణః భయమోహితః గర్దభాత్ అవాక్చిరాః పతితః మయా పునరేవ దృష్టః||

తా|| "రావణుడు ఎఱ్ఱని పూలమాలతో మైపూతలతో నూనె తాగి పిచ్చిగా నవ్వుతూ నృత్యము చేస్తూ గాడిదలు పూన్చిన రథముపై దక్షిణ దిశలో వెళ్ళెను. రాక్షసేశ్వరుడగు రావణుడు భయమోహితుడై గాడిదమీద నుంచి కింద పడినట్లు మళ్ళీ నాకు కనపడెను.

శ్లో|| సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః||26||
ఉన్మత్త ఇవ దిగ్వాసాదుర్వాక్యం ప్రలపన్ బహు|
దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమమ్||27||
మలపంకం ప్రవిశ్యాశు మగ్నస్తత్ర స రావణః|

స||సః రావణః సహసా ఉత్థాయ సంభ్రాంతః భయార్తః మద విహ్వలః దిగ్వాసః ఉన్మత్త ఇవ బహు దుస్సహం దుర్వాక్యం ప్రలపన్ దుర్గంధం ఘోరం తిమిరం నరకోపమమ్ మలపంకం ప్రవిశ్య ఆశు తత్ర మగ్నః||

తా|| "రావణుడు వెంటనే లేచి భ్రాంత చిత్తుడై, భయముతో మదముతో వివశుడై, బట్టలు లేని వాడై పిచ్చివాని వలె సహించలేని దుర్వాక్యములను ప్రేలాపించుచూ ఘోరము నరకముతో సమానమైన అంధకారమయమైన మలపంకములో పడి మునిగి పోయెను".

శ్లో|| కంఠే బధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసినీ||28||
కాలీ కర్దమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి
ఏవం తత్ర మయాదృష్టః కుంభకర్ణో నిశాచరః||29||
రావణస్య సుతాస్సర్వే దృష్టా స్తైలసముత్‍క్షితాః|
వరాహేణ దశగ్రీవ శ్శింశుమారేణ చ ఇంద్రజిత్||30||
ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశమ్||

స|| దశగ్రీవం కంఠే భధ్వా రక్తవాసినీ కర్దమలిప్తాంగీ కాలీ ప్రమదా యామ్యాం దిశం ప్రకర్షతి||తత్ర నిశాచరః కుంభకర్ణః ఏవం సర్వే రావణస్య సుతాః తైల సముక్షితాః దృష్టాః|| దశగ్రీవః వరాహేణ ఇంద్రజిత్ శింశుమారేణ ఉష్ట్రేణ కుంభకర్ణః దక్షిణాం దిశం ప్రయాతః||

తా|| "ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న అంగములపై బురదపూసుకొనిన ఒక నల్లని స్త్రీ దశగ్రీవుని కంఠములో తాడుకట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగినది. అక్కడ నిశాచరుడు అగు కుంభకర్ణుడు అలాగే రావణుని పుత్రులందరూ శరీరమునకు తైలము పూసికొని నట్లు కనబడిరి. దశగ్రీవుడు వరాహముపై, ఇంద్రజిత్తుమొసలిపై, కుంభకర్ణుడు ఒంటె పై ఎక్కి దక్షిణ దిశగా పోవుట కనపడినది".

శ్లో|| ఏకస్తత్ర మయా దృష్టా శ్శ్వేతచ్ఛత్రో విభీషణః||31||
శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః|
శంఖదుందుభినిర్ఘోషైః నృత్తగీతైరలంకృతః||32||
ఆరుహ్య శైలసంకాశం మేఘస్తనితనిస్స్వనమ్|
చతుర్దంతం గజం దివ్యమాస్తే తత్ర విభీషణః||33||
చతుర్భిః సచివైః సార్థం వైహాయస ముపస్థితః|

స|| తత్ర ఏకః శ్వేత ఛత్రః శుక్లమాల్యాంబరధరః శుక్లగంధానులేపనః విభీషణః మయా దృష్టః || విభీషణః శంఖదుందుభి నిర్ఘోషైః నృత్తగీతరలంకృతైః శైలసంకాసం మేఘస్తనితనిస్స్వనమ్ చతుర్దంతం దివ్యం గజం ఆరుహ్య తత్ర ఆస్తే | చతుర్భిః సచివైః సార్థం వైహాయసం ఉపస్థితః||

తా|| ఆ స్వప్నములో విభీషణుడు ఒక తెల్లని చత్రముతో తెల్లని బట్టలు ధరించి గంధములు పూసికొని కనపడెను. విభీషణుడు శంఖదుందుభి ఘోషలతో నృత్య గీతములతో పర్వతమువలె నున్న మేఘ గర్జనలతో సమానమైన గర్జనలు చేయుచున్న నాలుగు దంతములు కల దివ్యమైన గజములపై ఎక్కి వుండెను. నలుగురు సచివులతో కూడి ఆకాశములో నిలపడియుండెను.

శ్లో|| సమాజశ్చ మయా దృష్టో గీతవాదిత్ర నిస్స్వనః||34||
పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససామ్|
లంకాచేయం పురీ రమ్యా సవాజి రథకుంజరా||35||
సాగరే పతితా దృష్టా భగ్న గోపురతోరణా|

స|| పిబతాం రక్తమాల్యానాం రక్తవాససాం రక్షసాం గీతవాదిత్ర నిస్స్వనః సమాజశ్చ మయా దృష్టః|| రమ్యా ఇయం లంకాపురీ చ సవాజిరథకుంజరా భగ్నగోపుర తోరణా సాగరే పతితా మయా దృష్టః||

తా|| " తాగివున్న ఎఱ్ఱని పూలమాలలు వస్త్రములు ధరించియున్న రాక్షసులను, పాటలుపాడుతూ వున్న సమాజములను కూడా నేను చూచితిని. పడిపోయిన గోపురములు తోరణములతో కూడియున్న లంకానగరము గుర్రములు ఏనుగులతో సహా సాగరములో మునిగిపోవుట నేను చూచితిని ".

శ్లో|| లంకా దృష్టా మయా స్వప్నే రావణే నాభిరక్షితా||36||
దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా |
పీత్వా తైలం ప్రవృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః||37||
లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్టా రాక్షస స్త్రియః|
కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవః||38||
రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయహ్రదే|

స|| రావణేన అభిరక్షితా లంకా రామస్య దూతేన తరశ్వినా వానరేణ దగ్ధా మయా స్వప్నే దృష్టా|| భస్మరుక్షయాం లంకాయాం సర్వా రాక్షస్త్రియః తైలం పీత్వా ప్రహసంత్యః మహాస్వనాః ప్రనృతాః చ||కుంభకర్ణాదయః ఇమే సర్వా రాక్షసపుంగవాః నివసనం గృహ్య గోమయహృదే ప్రవిష్టాః||

తా|| " రావణునిచేత రక్షింపబడిన లంక రాముని దూత వాయువేగముకల వానరుని చేత దగ్ధము చేయబడినట్లు చూచితిని. భస్మరాసులతో నిండిన లంకలో రాక్షస స్త్రీలు నూనెతాగి పిచ్చిగా పెద్దగా ధ్వనిచేస్తూ నవ్వుతూ వున్నట్లు కనపడిరి. కుంభకర్ణాదులు అలాగే అందరూ రాక్షసపుంగవులు వస్త్రములు లేకుండా గోవుపేడగుంటలలో ప్రవేశించిరి ".

శ్లో|| అపగచ్ఛత నశ్యధ్వం సీతా మాప స రాఘవః||39||
ఘాతయేత్ పరమామర్షీ సర్వై స్సార్థం హి రాక్షసైః|
ప్రియాం బహుమతాం భార్యాం వనవాస మనువ్రతామ్||40||
భర్త్సితాం తర్జితాం వాపి నానుమంశ్యతి రాఘవః|

స|| అపగచ్ఛత నశ్యధ్వం| రాఘవః సీతాం ఆప్నోతి | పరమామర్షీ రాక్షసైః సార్థం యుష్మాన్ ఘాతయేత్||రాఘవః ప్రియాం బహుమతాం వనవాసం అనువ్రతాం భార్యామ్ భర్త్సితాం తర్జితాం వా అపి న అనుమంశ్యతి||

తా|| "ఓ రాక్షస స్త్రీలారా మీరు నశించిపోయెదరు. రాఘవుడు సీతను పొందును. అమితమైన కోపము కల రాఘవుడు మీ అందరినీ చంపివేయును. రామునికి ప్రియమైన వనవాస దీక్షతీసుకున్న భార్యను భయపెట్టిన దుర్భాషలాడిన వారిని వధించును".

శ్లో|| తదలం క్రూరవాక్యైః వః సాంత్వమేవాభిదీయతామ్||41||
అభియాచామ వైదేహీ మే తద్ధి మమరోచతే|
యస్యాం ఏవం విధః స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే||42||
సా దుఃఖైః వివిధై ర్ముక్తా ప్రియం ప్రాప్నోత్యనుత్తమమ్|
భర్త్సితా మపి యాచధ్వం రాక్షస్యః కిం వివక్షయా||43||
రాఘవాద్ధి భయం ఘోరం రాక్షసానా ముపస్థితమ్|

స|| తత్ అలం క్రూరవాక్యైః | వః సాంత్వమేవ అభిదీయతాం| వైదేహీం అభియాచామ ఏతద్ధి మే రోచతే||యస్యాం దుఃఖితాయాం ఏవం విధః స్వప్నః ప్రదృశ్యతే సా వివిధైః దుఃఖైః ముక్తా అనుత్తమం ప్రియం ప్రాప్నోతి || రాక్షస్యః భర్త్సితామపి యాచధ్వం కిం వివక్షయా రాక్షసానాం రాఘవాత్ ఘోరం భయం ఉపస్థితమ్||

తా|| "అందుకని ఈ క్రూర వాక్యములు చాలు. ఆమెతో శాంతముగా ప్రవర్తించుడు. వైదేహిని బ్రతిమాలుటయే మంచిది. నాకు అదే మంచిది అనిపించుచున్నది. దుఃఖములో నున్న ఎవరికి ఇట్టి స్వప్నము వచ్చునో వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు. అసమానమైన ప్రియమును పొందుదురు. రాక్షసులారా భయపెట్టినప్పటికీ ఆమెను యాచించుడు. ఇంకాచెప్పుట అనవసరము. రాక్షసులకు ఘోరమైన ఆపద సంభవించనున్నది".

శ్లో|| ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా||44||
అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్ |
అపి చాస్యా విశాలాక్ష్యా న కించి దుపలక్షయే||45||
విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణమ్|
ఛాయావైగుణ్యమాత్రం తు శంకే దుఃఖముపస్థితమ్||46||
అదుఃఖార్హా మిమాం దేవీం వైహాయస ముపస్థితమ్|

స|| రాక్షస్యః జనకాత్మజా ఏషా మైథిలీ ప్రణిపాతప్రసన్నా మహతః భయాత్ పరిత్రాతుం అలమ్|| అపి చ విశాలాక్షయాః అస్యాః అంగేషు సుసూక్ష్మపి విరూపం లక్షణమ్ కించిదపి న ఉపలక్ష్యతే||ఛాయావైగుణ్యమాత్రం చ వైహాయసం ఉపస్థితం అదుఃఖార్హం ఇమాం దేవీం దుఃఖం ఉపస్థితం శంకే||

తా|| "రాక్షసులారా జనకాత్మజ అయిన ఈ మైథిలి నమస్కరించబడి ప్రసన్నురాలై మహత్తరమైన భయమునుంచి మనలను రక్షింపగలదు. ఈ విశాలాక్షి అంగములలో అశుభకరమైన సూచనలు కనపడుటలేదు. ఆకాశమార్గములో ఉన్న ఆమెలో ఒక్క ఛాయమాత్రముగా తేడా వున్నది. దుఃఖము అనుభవించతగని ఆమెకు, అమిత దుఃఖము సంభవించినది".

శ్లో|| అర్థసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యహ ముపస్థితామ్||47||
రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవస్య చ|
నిమిత్తభూత మేత త్తు శ్రోతుమస్యా మహత్ప్రియమ్||48||
దృశ్యతే చ స్ఫురచ్ఛక్షుః పద్మ పత్ర మివాయతమ్|

స|| అహం వైదేహ్యాం అర్థసిద్ధిం ఉపస్థితం పశ్యామి | రాక్షసేంద్ర వినాశనం చ | రాఘవస్య విజయం చ|| అస్యాం మహత్ ప్రియం శ్రోతుం నిమిత్తభూతం స్పురత్ | ఏతత్ పద్మపత్రమివ ఆయతాం చక్షుః దృశ్యతే||

తా|| "నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను. అలాగే రాక్షస వినాశనము రాఘవుని జయము కూడా చూచుచున్నాను. . ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి. అమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది".

శ్లో|| ఈషచ్చ హృషితో వాస్యా దక్షిణాయా హ్యదక్షిణః||49||
అకస్మాదేవ వైదేహ్యా బాహురేకః ప్రకంపతే|
కరేణు హస్త ప్రతిమ స్సవ్య శ్చోరు రునుత్తమః||50||
వేపమాన స్సూచయతి రాఘవం పురతః స్థితమ్||51||

స||దక్షిణాయాః అస్యాః వైదేహ్యాః అదక్షిణః ఏకః బాహుః అకస్మాదేవ హృషితః ఈర్షత్ ప్రకంపతే||కరేణు హస్తప్రతిమః అనుత్తమః అవ్యః ఉరుః వేపమానః రాఘవం పురతః స్థితం సూచయతి ||

తా|| "శుభ సూచకములను సూచిస్తూ దక్షత కల ఈ వైదేహి ఎడమ భజము కంపిస్తున్నది. ఏనుగు తొండము లాంటి ఏడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది".

శ్లో|| పక్షీ చ శాఖా నిలయః ప్రహృష్టః
పునః పునశ్చోత్తమ సాంత్వవాదీ|
సుస్వాగతాం వాచ ముదీరయానః
పునః పునశ్చోదయతీవ హృష్టః||52||

స|| పక్షీ చ శాఖానిలయం ప్రవిష్టః పునః పునః చ ఉత్తమసాంత్వవాదీ సుస్వాగతం వాచం ఉదీరయామానః| హృష్టః పునః పునఃచోదయతీవ||

తా|| ఆ శాఖల మీద నున్న కోకిలలు మధురమైన కూతలు పదే పదే కూయుచూ అత్యంత ఆప్తునికి స్వాగతము చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి. అవి సంతోషముతో పదే పదే చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తవింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||